అర్ధరాత్రి బాలిక కిడ్నాప్ (వీడియో)

63చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. షెల్టర్ హోమ్ నుంచి ఓ 17 ఏళ్ల బాలికను ఆరుగురు ముసుగు ధరించిన వ్యక్తులు అపహరించారు. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో కంపూలోని వన్ స్టాప్ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు క్యాంపస్ వెనుక భాగంలో ఉన్న ఎత్తైన గోడ పైనుంచి దూకి లోపలికి ప్రవేశించారు. బాలికను లేపి తమవెంట తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనలో యువతి ప్రియుడి హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్