పారాఓలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలిసారి పతకాలు అందించిన మనీషా, తులసిమతి

62చూసినవారు
పారాఓలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలిసారి పతకాలు అందించిన మనీషా, తులసిమతి
పారాలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో భారత్‌కు తొలిసారి పతకాలు అందించి మనీషా రాందాస్, తులసిమతి మురుగేశన్‌ చరిత్ర సృష్టించారు. సోమవారం మహిళల సింగిల్స్ SU5 ఈవెంట్‌లో మనీషా కాంస్య పతక పోరులో డెన్మార్కు‌కు చెందిన కేథరీన్ రోసెన్‌గ్రెన్‌ను ఓడించి కాంస్యం సాధించింది. మహిళల సింగిల్స్ SU5 ఈవెంట్ ఫైనల్లో చైనాకు చెందిన యాంగ్ క్విక్సియా చేతిలో ఓటమి పాలైన తులసీమతి రజతం కైవసం చేసుకుంది.

సంబంధిత పోస్ట్