శనివారం రాత్రి సిక్కింలోని రాణిపూల్ సంత్లో విషాదం చోటుచేసుకుంది. సిక్కిం మిల్స్ యూనియన్కు చెందిన మిల్క్ ట్యాంకర్ అకస్మాత్తుగా స్టాల్ వద్ద తంబోలా ఆడుతున్న వారిపైకి దూసుకెళ్లి అక్కడ ఉన్న మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.