ఓవైపు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సమీపిస్తుండగా.. బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు జబ్బుపడితే గుడికి కాక ఆస్పత్రికి వెళ్తారని.. విద్య కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు కాక స్కూల్కు వెళ్తారని పేర్కొన్నారు. గుళ్ల పేరు చెప్పి కొంతమంది దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఈయనే రామచరితమానస్ను పోల్చి వార్తల్లో నిలవడం గమనార్హం.