గతంలో రోడ్లపై విజిబుల్ పోలీసింగ్ ఉండేది. పోలీసులు తరచూ గస్తీ కాస్తుండే వారు దాంతో ఎక్కువగా రాత్రిపూట నేరాలు జరగకపోయేవి. కానీ ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతాల్లో నిఘా లేకపోవడంతో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు సీసీ కెమెరాలు లేని సమయంలో పోలీసు గస్తీ ముమ్మరంగా ఉండి నేరాల నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ సుస్థిరంగా ఉండేదని, ఇప్పుడు అడుగడుగునా సీసీ కెమెరాలున్నా దారుణాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.