ఖరీఫ్‌ సీజన్‌ విత్తన లభ్యతపై మంత్రి తుమ్మల సమీక్ష

69చూసినవారు
ఖరీఫ్‌ సీజన్‌ విత్తన లభ్యతపై మంత్రి తుమ్మల సమీక్ష
తెలంగాణలో పచ్చిరొట్ట విత్తనాలకు కొన్ని ప్రాంతాల్లో అధిక డిమాండ్‌ ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ విత్తన లభ్యతపై తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాయితీపై పంపిణీ చేస్తున్న పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై సమీక్షించారు. రైతులకు అందుబాటులో ఉంచిన పత్తి విత్తనాల వివరాలపై ఆరా తీశారు. 50,942 క్వింటాళ్ల జిలుగు విత్తనాలు, 11,616 క్వింటాళ్ల జనుము విత్తనాలు, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్