దోహా డైమండ్ లీగ్లో భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రాకు తృటిలో గోల్డ్ మెడల్ మిస్ అయింది. నీరజ్ తన ఆరవ ప్రయత్నంలో 88.36 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లెజ్ తన నాలుగో ప్రయత్నంలో 88.38 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో కేవలం 0.02 మీటర్ల తేడాతో నీరజ్ చోప్రా అగ్రస్థానాన్ని కోల్పోయాడు. అయితే తాను 90 మీటర్లపై గురి పెట్టినట్లు నీరజ్ చెప్పాడు.