ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) 71వ ఎడిషన్ పోటీలు భారత్లో ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఇటీవల ప్రకటించారు. ఢిల్లీలో ప్రారంభ వేడుకతో పోటీలు ప్రారంభమై మార్చి 9 ముంబైలో ముగుస్తాయని తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపం సహా వివిధ వేదికల్లో పోటీ జరుగుతుంది. వివిధ దేశాలకు చెందిన 120 మంది అందెగత్తెలు వివిధ పోటీల్లో, దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.