ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే

80చూసినవారు
ఉద్యోగిపై ఎమ్మెల్యే విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన అస్సాంలో చోటుచేసుకున్నది. బిలాస్‌పూర్ ఎమ్మెల్యే షంసుల్ హుడా రెచ్చిపోయాడు. దైఖోవా మార్కెట్‌లో ఆర్‌సిసి వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో షంసుల్ హుడా, కాంట్రాక్టర్ ఉద్యోగి సాహిదుర్ రెహమాన్‌పై తీవ్రంగా దాడి చేశాడు. అతను ఎరుపు రంగుకు బదులుగా గులాబీ రంగు రిబ్బన్ పెట్టించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్