నల్గొండ జిల్లాల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బస్సులో బయలుదేరారు. ఈ సభకు కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. కృష్ణానదిపై ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని కేసీఆర్ ప్రస్తావించనున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు మేడిగడ్డకు వెళ్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.