సీఎం రేవంత్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. "జీవో-3 తీసుకొచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన జీవో-3 వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ ప్రభుత్వం మారుతోంది. ప్రజలను కలవడంలేదని కేసీఆర్ను విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయనెందుకు ప్రజలకు కనపడటం లేదు." అని కవిత ప్రశ్నించారు.