గాంధీ సినిమా వెలుగుచూసేంత వరకూ మహాత్మ గాంధీ గురించి ప్రపంచానికి తెలియదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే భగ్గుమనగా తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ప్రధాని మోదీ గుజరాత్ వ్యక్తని, గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తికే మహాత్మ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆసక్తి లేదని ఖర్గే వ్యాఖ్యానించారు.