బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తాజాగా నటించిన మూవీ 'ఛావా'. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ కొడుకు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర యూనిట్ను మెచ్చుకున్నారు. దీంతో విక్కీ కౌశల్ ప్రధానికి ధన్యవాదాలు చెబుతూ.. తన ఆనందం వ్యక్తం చేశారు.