నల్గొండలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో శనివారం ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 35 మంది కార్మికులు టన్నెల్లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా టన్నెల్ కుంగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు టన్నెల్లోనే చిక్కుకుపోయారు. ఘటనపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.