అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠపన తర్వాత తొలిసారిగా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. దీనిపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘మన రామ్లల్లా అయోధ్యలోని రామాలయంలో సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఇదే మొదటి రామనవమి. 5 శతాబ్దాల నిరీక్షణ తర్వాత, ఇవాళ మనకు ఈ విధంగా అయోధ్యలో రామనవమి జరుపుకునే భాగ్యం లభించింది’ అని పేర్కొన్నారు.