రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

69చూసినవారు
రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో 18వ తేదీ గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. 18వ తేదీ నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల స్క్రూటినీ, 29న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.

సంబంధిత పోస్ట్