తెలుగు రాష్ట్రాల్లో 18వ తేదీ గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. 18వ తేదీ నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల స్క్రూటినీ, 29న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.