"మోదీ ప్రధాని అయ్యేవరకు బూట్లు ధరించనని" 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేసిన హర్యానాలోని కైథల్కు చెందిన రాంపాల్ కశ్యప్ కోరిక ఎట్టకేలకు నెరవేరింది. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికైనా, కశ్యప్ స్వయంగా కలవలేకపోయారు. చివరికి విషయం తెలుసుకున్న PM మోదీ, సోమవారం హర్యానా పర్యటన సందర్భంగా స్వయంగా కశ్యప్కు ఫోన్ చేసి పిలిపించుకుని, స్పోర్ట్స్ షూ బహుమతిగా ఇచ్చారు. కశ్యప్ బూట్లు ధరిస్తుంటే మోదీ సాయం చేయడం విశేషం.