నరేంద్ర
మోదీ మళ్లీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆయన మూడోసారి పాలనను పూర్తి చేస్తారని చెప్పారు. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, అప్పుడు ఆయన పదవీ విరమణ చేస్తారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను సీఎం పదవి నుంచి దించుతారని, అమిత్ షాను ప్రధానిని చేస్తారని వ్యాఖ్యానించారు.