యూపీలోని మీరట్ జిల్లా కేంద్రంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ పైపులు, వైర్లలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.