సైబర్ నేరగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఒకేసారి 18 లక్షలకుపైగా మొబైల్ కనెక్షన్లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే డివైజ్ నుంచి వేలల్లో కనెక్షన్లు వినియోగించిన సందర్భాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల 28,220 ఫోన్లను బ్లాక్ చేయమని కేంద్రం టెలికాం సంస్థలను ఆదేశించింది. కాగా కేంద్రం ఏడాదిలో 1.70 కోట్ల కనెక్షన్లను తొలగించింది.