కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల పరిధిలోని ఏ-బుడిదపాడు గ్రామానికి చెందిన మాల నరసింహులు భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ (18) మంగళవారం ఇంట్లోనే పురుగుల మందు తాగారు. వరలక్ష్మి, అనురాధ పరిస్థితి తీవ్రంగా ఉండడంతో స్థానికులు కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా నరసింహులుకు అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు, కుటుంబ గొడవలు జరిగినట్లు స్థానికులు తెలిపారు.