తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఏఏను రాష్ట్రంలో అమలు చేయబోమన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొని మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.