తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి సుల్తానా, మోనిషా, లోగనాయగి అనే యువతులతో అఫైర్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో లోగనాయగితో గొడవ జరగడంతో అడ్డు తొలగించుకోవడానికి మిగిలిన ఇద్దరి గర్లఫ్రెండ్స్తో కలిసి ఆమెకు విషమిచ్చి లోయలో పడేశాడు. అయితే లోగనాయగి కనిపించకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. హత్య విషయం బయటపడింది. దీంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.