రేపు కల్వకుర్తిలో పర్యటించనున్న మంత్రి పొంగిలేటి

69చూసినవారు
రేపు కల్వకుర్తిలో పర్యటించనున్న మంత్రి పొంగిలేటి
కల్వకుర్తి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా మంత్రి పొంగిలేర్తి శ్రీనివాస్ రెడ్డి తో పాటు నాగర్ కర్నూల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం తెలిపారు. నియోజకవర్గంలోని కడ్తాల, వెల్దండ, కల్వకుర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో 70 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్