నల్గొండ జిల్లా దేవరకొండలో ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గుర్రంపోడ్ మండలం మొండికానిగూడెంకు చెందిన రఘుమారెడ్డి నేరేడుగొమ్మ పీఎస్లో పనిచేస్తూ భార్య శ్రీవాణితో కలిసి దేవరకొండ పోలీసు క్వార్టర్స్లో నివసిస్తున్నాడు. ఈ నెల 20న భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్త డ్యూటీకి వెళ్లగా జుట్టుకు వేసుకొనే రంగు తాగి భార్య ఆత్మహత్య చేసుకుంది. శ్రీవాణి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.