విజయవాడలో శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాలుగు భోగీలు ట్రాక్పై ఒరిగాయి. ఈ ఘటన రాయనపాడు రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి రైల్వే ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-హైదరాబాద్ రూట్లో పలు రైళ్లు దారి మళ్లించారు.