తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే భానుడు భగ భగ మండుతున్నాడు. కొద్దిరోజుల కిందటి వరకు ఉదయం, రాత్రి వేళల్లో కాస్త చలి తీవ్రత ఉన్నా.. నిన్న మొన్నటి నుంచి పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఉదయం ఎనిమిది కాకముందే జనం ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రజలు చల్లదనం కోసం ఏసీలు, కూలర్లను వినియోగిస్తున్నారు.