రైతులను ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర

1111చూసినవారు
నల్గొండ జిల్లా దేవరకొండలో శనివారం రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ అధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫి, వరికి బోనస్, ఎకరాకు 15000 రూపాయల రైతు బంధు ఇవ్వాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్