నల్గొండ జిల్లా పిఏ పల్లి మండలం అక్కంపల్లికి చెందిన మాద గోవర్ధన్ గౌడ్ ను జాతీయ అవార్డు వరించింది. బి. ఆర్. అంబేద్కర్, స్వామి వివేకానందలను ఆదర్శంగా తీసుకున్న గోవర్ధన్ గౌడ్ సామాజిక సేవా దృక్పథంతో చేసిన అనేక సేవలను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమి, సేవారత్న జాతీయ అవార్డు 2024కు ఎంపిక చేసింది. గురువారం హైదారాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అకాడమీ చైర్మన్ రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.