వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి

72చూసినవారు
రాష్ట్రంలో వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం దేవరకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన అత్యవసరమైతే మిలటరీ సహాయాన్ని, హెలికాప్టర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వరదలను, వర్షపాతాన్ని ఊహించి ప్రాజెక్టుల గేట్లను ఎత్తాలని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్