హాస్టళ్ళలో మెనూ ప్రకారం భోజనం అందించాలి

69చూసినవారు
హాస్టళ్ళలో మెనూ ప్రకారం భోజనం అందించాలి
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందు నాయక్ అన్నారు. ఆదివారం దేవరకొండలో పలు హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని హాస్టళ్లలో అరకొర వసతులు ఉన్నాయని, జిల్లా అధికారులు హాస్టళ్లను సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్