దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ అవ్ళంబిస్తున్న కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం మాడ్గులపల్లి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు దేవి రెడ్డి, అశోక్ రెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తు నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని తెలిపారు.