స్కాములకు కేరాఫ్ అడ్రస్
కాంగ్రెస్ అని నల్గొండ
బీజేపీ ఎంపీ అభ్యర్థి సైది రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హమీనైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం కామన్ గా మారింది.
కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. గ్రామాల అభివృద్ధికి ప్రతి రూపాయి కేంద్రం ఇచ్చిందే అని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. మాటల వరకే
కాంగ్రెస్ పరిమితం అని అన్నారు. కేంద్రంలో
బీజేపీ ఉంటేనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు.