మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా ప్రైవేటుపాఠశాలల్లో నిబంధనలు అతిక్రమించి అక్రమఫీజులు వసూలు చేస్తున్నారని బీసీ విద్యార్థి సంఘం, ఎమ్మార్పీఎస్ ల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఒక్కోవిద్యార్థినుంచి రూ. 3500ల అడ్మిషన్ ఫీజు సహా పాఠ్య, నోటు పుస్తకాలకోసం వేలాదిరూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థిసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్, సందాల శంభయ్య తదితరులు పాల్గొన్నారు.