ఖాళీ బిందెలతో సీపీఎం నిరసన

1076చూసినవారు
మిర్యాలగూడ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సాగర్ నీటితో చెరువులు, కుంటలు నింపాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం మండల పరిధిలోని అయిలాపురం గ్రామంలో ఎండిన చెరువును పరిశీలించి గ్రామస్తులతో కలిసి ఖాళీ బిందెలు ప్రదర్శించి మాట్లాడారు. సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరక ముందే ప్రాజెక్టు నీటితో చెరువులు కుంటలునింపి భూ గర్భజలాలుసంరక్షించాలనిప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్