చెన్నయిపాలెంలో ఐకేపీ సెంటర్ ప్రారంభం

750చూసినవారు
చెన్నయిపాలెంలో ఐకేపీ సెంటర్ ప్రారంభం
త్రిపురారం మండలం చెన్నయి పాలెం గ్రామ పంచాయతీలో ఐకేపీ సెంటర్ ను మరియు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు ఇస్లావత్ రాంచందర్ నాయక్ పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా పిఏసిఎస్ డైరెక్టర్ జయరాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, త్రిపురారం మండలం ఎంపీపీ పాండమా శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్, గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ వెంకన్న, సర్పంచ్ శివ నాయక్, ఉప సర్పంచ్ రామయ్య, శీలం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి చెన్నాలు, మాజీ సర్పంచ్ సైదయ్య, సీతారాం నాయక్ మరియు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్