మాడుగులపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో అవాసం చెర్లగుడెంలో రామాలయ నిర్మాణానికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు పోకల రాజు కొబ్బరి కాయలు కొట్టి భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి 10000 రూపాయల విరాళం అందించడం జరిగింది. ఇటివలే భీమనపల్లి గ్రామంలో సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి 20000 రూపాయల విరాళం అందించారు.