ఇంటి ఆవరణలో గంజాయి సాగు

67చూసినవారు
నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం బుడ్డారెడ్డిగూడెంలో 128 గంజాయి మొక్కలను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుడ్డారెడ్డిగూడెంలో గంజాయి సాగు చేస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్సై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. దీంతో కొండమల్లేపల్లి సిఐ ధనుంజయ పర్యవేక్షణలో వ్యవసాయ అధికారి మాధవరెడ్డి సమక్షంలో అక్కడికి వెళ్లి పరిశీలించగా గంజాయి మొక్కలను వారి సమక్షంలో స్వాధీనం చేసుకొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్