ఏపిజివిబి మేనేజర్ కి ఘనంగా వీడ్కోలు సన్మానం

754చూసినవారు
ఏపిజివిబి మేనేజర్ కి ఘనంగా వీడ్కోలు సన్మానం
నల్గొండ జిల్లా శాలీగౌరారం ఏపిజివిబి బ్రాంచ్ మేనేజర్ నటరాజన్ బదిలీ అవుతున్న సందర్భంగా శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐకేపి నిర్వాహకులు, బ్యాంక్ సిబ్బంది, పలు గ్రామాలకు చెందిన బ్యాంక్ మిత్రలు, ఖాతాదారులు హాజరై గత నాలుగు సంవత్సరాలుగా మేనేజర్ చేసిన సేవలను గుర్తుచేసుకొని కొనియాడారు. మేనేజర్ నటరాజన్ మాట్లాడుతూ శాలీగౌరారం బ్రాంచ్ ని విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉన్నప్పటికీ, ఉద్యోగరీత్యా బదిలీలు తప్పవని భావోద్వేగానికి లోనయ్యారు. తమ బ్యాంకుకి వచ్చే కస్టమర్లను దేవుళ్లుగా భావించి మా బ్యాంక్ సిబ్బంది సహకారంతో ముందుకు బ్యాంక్ ను తీసుకెళ్లానని అన్నారు. సన్మాన సభకు వచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్