ఏపీజీవీబీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

1051చూసినవారు
ఏపీజీవీబీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
నల్గొండ జిల్లా శాలీగౌరారం మండలం వల్లాల గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ యొక్క పథకాలను వివరిస్తూ శాలీగౌరారం బ్రాంచ్ APGVB వారి ఆధ్వర్యంలో కళా ప్రదర్శన నిర్వహించారు. బ్యాంకులోని వివిధ రకాల స్కీం లను కళాకారులు అద్భుతంగా వివరించారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలు ఏ విధంగా చేస్తారో వివరించారు. PMJJBY(330), PMSBY(12), SBIGPA(1000) లాంటి ఇన్సూరెన్స్ లను 1342 రూపాయలతో చేసి 24లక్షల ప్రమాద భీమాను పొందవచ్చని శాలీగౌరారం బ్రాంచ్ APGVB మేనేజర్ నటరాజన్ అన్నారు. గ్రామస్తులకు ఏమైనా సందేహాలుంటే గ్రామానికి సంబంధించిన బ్యాంకు మిత్ర సుంకి సతీష్ ని కలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్, క్యాషియర్లు రవి వర్మ, వీరబాబు, మెసేంజర్ సైదులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్