డాక్టర్ మోదాల మల్లేష్‌కి తెలుగు వెలుగు జాతీయ విశిష్ట విద్య సేవారత్న పురస్కారం

589చూసినవారు
డాక్టర్ మోదాల మల్లేష్‌కి తెలుగు వెలుగు జాతీయ విశిష్ట విద్య సేవారత్న పురస్కారం
నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పోటీపరీక్షల నిపుణులు, పలు ఆంగ్ల, తెలుగు దినపత్రికల కాలమిస్ట్ డాక్టర్ మోదాల మల్లేష్ కి తెలుగు వెలుగు సాహితీ వేదిక తెలుగు వెలుగు జాతీయ విశిష్ట విద్య సేవారత్నతో సత్కరించింది. డాక్టర్ మల్లేష్ పోటీపరీక్షలకు సన్నదమయ్యేవారికోసం పలు ఆంగ్ల, తెలుగు దినపత్రికలలో వందలాది విద్యాసంబంధిత వ్యాసాలు వ్రాయడంతో పాటు, డిగ్రీ విద్యార్థులు, పోటీపరీక్షార్థుల కోసం పుస్తకాలు వ్రాసారు. అంతేకాకుండా ఈయన పత్తిపంటలపై కాలానుగుణంగా కనిపించే కీటకాల వైవిధ్యంపై పరిశోధన చేశారు.

సంబంధిత పోస్ట్