నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు దండంపల్లి మారయ్య ఇటీవల తాటి చెట్టు పైనుండి పడి గాయపడగా వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా 15 వేల రూపాయలు చెక్కు టాడి కార్పొరేషన్ నుండి మంజూరు కాగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగోని సీతారాములు, శాలిగౌరారం మండల కార్యదర్శి భూపతి శ్రీనివాస్ గౌడ్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. విషయం తెలియగానే వెంటనే సహకరించిన టాడి కార్పొరేషన్ చైర్మన్ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బర్రా వెంకటేశంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.