నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు వీలైనన్ని మరిన్ని మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆసుపత్రి వైద్యులతో కోరారు. బుధవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల అధిపతులతో ఆసుపత్రి పని తీరుపై సమీక్షించారు. జిల్లా ప్రభుత్వ ప్రధానఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలను పెంచాలని, అన్ని రకాల రోగులను ఆరోగ్యశ్రీ కింద చూడాలని రోగులకు ఇబ్బంది లేకుండా సేవలందించాలని అన్నారు.