నల్గొండ జిల్లా పరిషత్ పాలక మండలి పదవీ కాలం గురువారంతో ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి పదవి కాలం గురువారం ముగియడంతో నల్గొండ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ సి. నారాయణరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.