
నర్వ: క్రీడలతో శరీరం దృఢంగా మారుతుంది
క్రీడలు ఆడటం ద్వారా శరీరం దృఢంగా మారుతుందని ఎస్సై కురుమయ్య అన్నారు. సోమవారం నర్వ మండలంలోని పాతర్ చెడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కాసేపు సరదాగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రికెట్ లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లా రాష్ట్రస్థాయిలో ఆడాలని సూచించారు. యువకులు క్రీడలపై ఆసక్తి చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు.