మాజీ ఎమ్మెల్యే చిట్టి సమక్షంలో పార్టీలో చేరికలు
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని మూడో వార్డు మెంబర్ జగ్గలి రాములు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం వివిధ పార్టీలకు చెందిన 25 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం పార్టీ కండువా వేసి సాధారంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, నాయకులు జుట్ల శంకర్, చిన్న హనుమంతు తదితరులు పాల్గొన్నారు.