త్వరలో జాతీయ జనాభా గణన: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

56చూసినవారు
త్వరలో జాతీయ జనాభా గణన: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
దేశంలో ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైన జాతీయ జన గణనను త్వరలో నిర్వహించనున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలిపారు. 'మేం జనాభా గణనను పూర్తి చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తాం' అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి దేశంలో పదేళ్లకోసారి చేపట్టే జాతీయ జనగణనను 2020 ఏప్రిల్ 1న ప్రారంభించాలని కేంద్రం భావించింది. కానీ కొనిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్