నేడు తెలంగాణకు NDSA బృందం

79చూసినవారు
నేడు తెలంగాణకు NDSA బృందం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని అధ్యయనం చేసేందుకు జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది. మధ్యాహ్నం జలసౌధలో నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఈఎన్సీలతో సమావేశం కానుంది. ఈ నెల 7, 8వ తేదీల్లో బ్యారేజీలను సందర్శించి తనిఖీలు నిర్వహించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్