భారత్కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్, ఎండీహెచ్కు మరో షాక్ తగిలింది. ఇటీవలే సింగపూర్, హాంకాంగ్లో వేటుకు గురైన ఈ కంపెనీలపై తాజాగా నేపాల్ కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తాజాగా ప్రకటించారు. వీటిలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.