పార్లమెంట్లో కొత్తగా ఎన్నికైన 18వ లోక్సభ ఈనెల 24న తొలిసారి కొలువుదీరనున్నట్టు పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా ఎక్స్లో ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జులై 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ఇతర కీలక అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. రాజ్యసభ 264వ సెషన్ కూడా 24వ తేదీనే ప్రారంభం కానున్నట్లు వివరించారు.